కుప్పంలో పేదల ఇళ్లు కూల్చివేత

ABN , First Publish Date - 2020-07-07T01:20:13+05:30 IST

జిల్లాలోని కుప్పంలో అమరావతి కాలనీలో పేదలకు ఇచ్చిన ఇళ్లను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అధికారులు కూల్చివేశారు. గత టీడీపీ హయాంలో దళితులకు ఇచ్చిన 20 ఇళ్లను

కుప్పంలో పేదల ఇళ్లు కూల్చివేత

చిత్తూరు: జిల్లాలోని కుప్పంలో అమరావతి కాలనీలో పేదలకు ఇచ్చిన ఇళ్లను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అధికారులు కూల్చివేశారు. గత టీడీపీ హయాంలో దళితులకు ఇచ్చిన 20 ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చివేశారు. దీంతో లబ్దిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఎలా ఇళ్లు కూలగొడతారని అధికారులను నిలదీశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా, దీనిపై మాట్లాడేందుకు సంబంధిత అధికారులు అందుబాటులో లేకుండా పోయారు.

Updated Date - 2020-07-07T01:20:13+05:30 IST