జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జి గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2020-09-23T10:31:25+05:30 IST
జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జి గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
లికిరి, సెప్టెంబరు 22: జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జి గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ/వార్డు సచివాలయాలు పర్యవేక్షించే జాయింట్ కలెక్టరు మరో ఆరు నెలలు సంస్థకు పర్సన్ ఇన్చార్జిగా కొనసాగే విధంగా ఈ ఆదేశాలు విడుదలయ్యాయి.
ప్రస్తుతం జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాల పర్యవేక్షణ జేసీ వీరబ్రహ్మం నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 17 నుంచి వచ్చే ఏడాది మార్చి 16 వరకూ పొడిగింపు ఉత్తర్వులు వర్తిస్తాయి. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ ఆదేశాలు జారీ చేశారు.