అడ్డుకుంటున్న పోలీసులు... బస్సుల్లో తిరుపతికి టీడీపీ శ్రేణులు
ABN , First Publish Date - 2021-12-17T17:54:35+05:30 IST
తిరుపతిలోని అమరావతి మహాసభలకు వెళుతున్న టీడీపీ శ్రేణులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు.
చిత్తూరు: తిరుపతిలోని అమరావతి మహాసభలకు వెళుతున్న టీడీపీ శ్రేణులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. చిత్తూరులో మాజీ మేయర్ కటారి హేమలత ప్రయాణిస్తున్న వాహనానికి ఇన్సూరెన్స్ లేదన్న సాకుతో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. సభకు హాజరవుతున్న టీడీపీ శ్రేణులను నేంద్ర గుంట టోల్ ప్లాజా వద్ద తనిఖీల పేరుతో పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో విధిలేని పరిస్థితుల్లో చాలామంది బస్సుల్లో తిరుపతికి చేరుకుంటున్న వైనం కనిపిస్తోంది. జిల్లాలో చాలా రహదారుల్లో ఇదే పరిస్థితి ఉంది.