పెళ్లికి వరుడు నిరాకరించడంతో.. అమెరికాలో చిత్తూరు యువతి..!

ABN , First Publish Date - 2021-03-05T05:14:32+05:30 IST

వరుడు పెళ్లికి నిరాకరించడంతో చిత్తూరు జిల్లాకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అమెరికా

పెళ్లికి వరుడు నిరాకరించడంతో.. అమెరికాలో చిత్తూరు యువతి..!

అమరావతి: వరుడు పెళ్లికి నిరాకరించడంతో చిత్తూరు జిల్లాకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు పోలీస్ కాలనీకి చెందిన సుష్మ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. పూతలపట్టు మండటం బందార్ల పల్లే గ్రామానికి చెందిన భరత్ అనే యువకుడు కూడా అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లి చేయాలని పెద్దలు భావించారు. ఈనెల 3న వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వధూవరులకు మధ్య పెళ్లికి ముందు మనస్పర్థలు రావడంతో.. వారం రోజుల క్రితం భరత్ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. కాగా.. పెళ్లి సమయం నాటికి అన్ని సర్దుకుటాయని ఇరు కుటుంబాల వారు భావించారు. అయితే భరత్ తన మనసు మార్చుకోలేదు. ఈ క్రమంలో సుష్మ ఆత్మహత్య చేసుకుంది. దీంతో యువతి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. 


Updated Date - 2021-03-05T05:14:32+05:30 IST