రేపు అధికార లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-12-09T15:59:33+05:30 IST

ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో జిల్లా వాసి సాయితేజ మరణించడంతో స్వగ్రామం ఎగువరేగడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

రేపు అధికార లాంఛనాలతో సాయితేజ అంత్యక్రియలు

చిత్తూరు:  తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో జిల్లా వాసి సాయితేజ మరణించడంతో స్వగ్రామం ఎగువరేగడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోక సంద్రంలో ఉన్నారు. ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయానికి సాయి తేజ మృతదేహం గ్రామానికి చేరుకోనుంది. రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి అధికార యంత్రాంగం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తోంది. సిక్కిం ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సాయితేజ తమ్ముడు మహేష్ బాబు  అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు సాయితేజ ప్రాణ స్నేహితుడైన  వేపూరికోటకు చెందిన కార్తీక్ రెడ్డి  నవంబర్ 5న ఆర్మీలోని జమ్మూ కాశ్మీర్‌లో మంచు కొండచరియలు విరిగిపడి మృతి చెందాడు. నెల తిరక్క ముందే సాయి తేజ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం  స్థానికులను తీవ్రంగా కలచి వేస్తోంది. వీరిద్దరూ ఒకేసారి ఆర్మీలో రిక్రూట్ అవడమే కాకండా... మరణంలోనూ ఇద్దరు వెంట వెంటనే మృతి చెందడం విషాదాన్నినిపింది.

Updated Date - 2021-12-09T15:59:33+05:30 IST