చిత్తూరులో దారుణం.. స్పందించిన సోనూసూద్

ABN , First Publish Date - 2020-08-13T22:25:18+05:30 IST

చిత్తూరు : జిల్లాలోని కలగటూరులో దారుణం చోటు చేసుకుంది.

చిత్తూరులో దారుణం.. స్పందించిన సోనూసూద్

చిత్తూరు : జిల్లాలోని కలగటూరులో దారుణం చోటు చేసుకుంది. గంగవరం మండలం కలగటూరు గ్రామానికి చెందిన వెంకటరామయ్యను ఆవు గుండెలపై తొక్కడంతో బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా ప్రైవేటు వైద్యం పొందుతూ పలమనేర్ పట్టణంలోని బజార్ వీధిలో మృతి చెందారు. శవాన్ని ఆటోవాలాలు రోడ్డుపైనే పడవేసి వెళ్లిపోవడంతో అతని కుమార్తె బోరున విలపించింది.


ఈ సంఘటనపై చెలించిన సినిమా యాక్టర్ సోనుసూద్.. వెంకటరామయ్య కుమార్తెను పరామర్శించి ఆర్థికంగా ఆదుకోవడానికి అతని మనుషులను పలమనేరుకు పంపనున్నారు. శుక్రవారం బెంగళూరు నుంచి సోనుసూద్ మనుషులు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోనున్నారు.


Updated Date - 2020-08-13T22:25:18+05:30 IST