Chittoor: కొడుకు పెళ్లిలో గొడవ..భార్య గొంతు కోసిన భర్త..

ABN , First Publish Date - 2022-09-12T16:55:13+05:30 IST

శాంతిపురం మండలం శెట్టిగాని కురుబురులో విషాదం చోటు చేసుకుంది. కొడుకు వివాహం(son's marriage) తల్లి ప్రాణం తీసింది. ఈ ఘటన

Chittoor: కొడుకు పెళ్లిలో గొడవ..భార్య గొంతు కోసిన భర్త..

Chittoor: శాంతిపురం మండలం శెట్టిగాని కురుబురులో విషాదం చోటు చేసుకుంది. కొడుకు వివాహం(son's marriage) తల్లి ప్రాణం తీసింది. ఈ ఘటన చిత్తూరు(Chittoor) జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే..భార్య మునెమ్మ, భర్త మురుగేష్. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు వివాహం చేశారు. అయితే.. వీరి మధ్య తరుచూ గొడవలు జరుగుతూనే ఉండేవి. కొన్నిసార్లు వీరి పంచాయతీ పెద్దల వరకు వెళ్లిన రోజులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో గత కొన్ని రోజుల క్రితం కొడుకు వివాహంలో మునెమ్మ, మురుగేష్ మధ్య చిన్నపాటి మనస్పార్ధాలతో గొడవ జరిగింది. ఆ చిన్నపాటి గొడవ పెద్దదిగా మారింది. భార్య మునెమ్మపై కొపంతో రగిలిపోతున్న భర్త మురుగేష్ కత్తితో భార్య గొంతు కోసి హతమార్చాడు. ప్రాణాలతో కొట్టుకుంటున్న తల్లిని కుమారుడు ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మార్గ మధ్యలో ప్రాణాలు విడిచింది. నిందితుడు మురుగేష్ రాళ్లబుడుగురు పోలీస్ స్టేషన్‎లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-09-12T16:55:13+05:30 IST