AP: చిత్తూరులో దారుణం

ABN , First Publish Date - 2021-11-17T11:55:19+05:30 IST

భర్తే కాలయముడయ్యాడు. నిద్రిస్తున్న భార్య తలపై మోది హతమార్చాడు. రాత్రికి రాత్రే పరారయ్యాడు. అనుమానం నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రామచంద్రాపురం మండలం పారకాల్వ గ్రామంలో జరిగిన ఈ ఘటనను డీఎస్పీ

AP: చిత్తూరులో దారుణం

చిత్తూరు: భర్తే కాలయముడయ్యాడు. నిద్రిస్తున్న భార్య తలపై మోది హతమార్చాడు. రాత్రికి రాత్రే పరారయ్యాడు. అనుమానం నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రామచంద్రాపురం మండలం పారకాల్వ గ్రామంలో జరిగిన ఈ ఘటనను డీఎస్పీ రామచంద్రుడు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. వడమాలపేట మండలం బద్రంపల్లె ఎస్టీ కాలనీకి చెందిన భాస్కర్‌(50), అమ్ములు(42)కు పాతికేళ్ల కింట వివాహమైంది. వీరికి ప్రేమ్‌కుమార్‌, పవన్‌కుమార్‌ పిల్లలు. తొలినుంచీ అనుమానంతో భార్యను వేధించేవాడు. ఏడాది కిందట రామచంద్రాపురం మండలంలోని పారకాల్వ గ్రామంలోని కోళ్లపారం వద్ద వీరు స్థిరపడ్డారు. అమ్ములు ఎవరితో మాట్లాడినా భాస్కర్‌గొడవపడేవాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మూడు నెలలుగా మాటల్లేవు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అనంతరం అమె నిద్రిస్తున్న సమయంలో తలపై పదునైన ఆయుధంతో కొట్టి భాస్కర్‌ పరారయ్యాడు. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి తల్లి మంగమ్మ ఫిర్యాదుతో మంగళవారం ఉదయం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతికి తరలించి, ఎస్‌ఐ ఎర్రిస్వామి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-11-17T11:55:19+05:30 IST