నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన..టెన్షన్ టెన్షన్

ABN , First Publish Date - 2021-02-25T14:27:39+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో మూడు రోజుల పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గుడపల్లె మండలానికి బాబు చేరుకోనున్నారు.

నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన..టెన్షన్ టెన్షన్

చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం వెళ్తారు. శాంతిపురం, రామకుప్పం మండలాల పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతారు. సోమవారం ఉదయం అమరావతికి తిరిగి వస్తారు. ఇక చంద్రబాబు పర్యటనతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని కుప్పం టీడీపీ నేతలు హెచ్చరించారు. ఇక కుప్పంలో గెలిచామని కాలర్ ఎగరేసిన వైసీపీ ఫ్యాన్స్ ఇప్పుడు చంద్రబాబును అడ్డుకుంటామని అంటున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. మీ గెలుపులో నిజాయితీ ఉంటే టూర్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మరోవైపు కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ శ్రేణులు హెచ్చరించారు. నిన్నటి రోజున టీడీపీ నాయకుల ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు దగ్ధం చేశారు. దీంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు బలగాలు చేరుకున్నారు. ప్రస్తుతం కుప్పంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.

Updated Date - 2021-02-25T14:27:39+05:30 IST