చిత్తూరులో పలుచోట్ల భారీ వర్షాలు... కొట్టుకుపోయిన కార్లు

ABN , First Publish Date - 2020-10-23T13:14:47+05:30 IST

జిల్లాలో పలుచోట్ల గత రాత్రి భారీ వర్షాలు కురుశాయి. వరద నీటితో వాగులు వంకలు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి.

చిత్తూరులో పలుచోట్ల భారీ వర్షాలు... కొట్టుకుపోయిన కార్లు

చిత్తూరు: జిల్లాలో పలుచోట్ల గత రాత్రి భారీ వర్షాలు కురుశాయి. వరద నీటితో వాగులు వంకలు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. పెనుమూరు మండలం కొండయ్య గారి పల్లి వద్ద వరద నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్నవారిలో ఇద్దరు గల్లంతవగా.. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారు పూతలపట్టు మండలం ఒడ్డు పల్లెకు చెందిన వారుగా గుర్తించారు. అటు శ్రీరంగరాజపురం మండలం దుర్గరాజుపురం(తెల్లగుండ్లపల్లె) వద్ద కారు కొట్టుకుపోయింది. కాగా అందులో ప్రయాణిస్తున్న వారు బయటకు దూకేయడంతో ప్రాణాలు కాపాడుకున్నారు. కారు మాత్రం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. 

Updated Date - 2020-10-23T13:14:47+05:30 IST