వైసీపీ నాయకుల బరితెగింపు.. టీడీపీ ఫ్లెక్సీకి నిప్పు..

ABN , First Publish Date - 2022-01-16T17:35:51+05:30 IST

చిత్తూరు: జిల్లాలో ఫ్లెక్సీ వివాదం రాజుకుంది. రామచంద్రాపురం మండలం, సొరకాయల పాల్యం గ్రామంలో..

వైసీపీ నాయకుల బరితెగింపు.. టీడీపీ ఫ్లెక్సీకి నిప్పు..

చిత్తూరు: జిల్లాలో ఫ్లెక్సీ వివాదం రాజుకుంది. రామచంద్రాపురం మండలం, సొరకాయల పాల్యం గ్రామంలో చంద్రగిరి నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు పూజారి సుబ్రహ్మణ్యం యాదవ్ గ్రామస్తులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ నాయకుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత భాస్కర్ యాదవ్, అతని అనుచరులు టీడీపీ ఫ్లెక్సీలను చించి పెట్రోల్ పోసి కాల్చడంతో గ్రామంలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


టీడీపీ నేత పూజారి సుబ్రహ్మణ్యం యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ స్వామి పోలీస్ సిబ్బందితో సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. అయితే అప్పటికే వైసీపీ నేత భాస్కర్ యాదవ్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-01-16T17:35:51+05:30 IST