చిత్తూరు జిల్లా: వరద బాధితులకు సహాయం చేస్తున్న టీడీపీ

ABN , First Publish Date - 2021-12-03T19:46:48+05:30 IST

ప్రభుత్వం పట్టించుకోవడంలేదని చిత్తూరు జిల్లా వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా: వరద బాధితులకు సహాయం చేస్తున్న టీడీపీ

చిత్తూరు జిల్లా: ప్రభుత్వం పట్టించుకోవడంలేదని చిత్తూరు జిల్లా వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతో ఇంతో ప్రతిపక్షం టీడీపీనే సాయం చేస్తోందని చెబుతున్నారు. బాధితులకు టీడీపీ నేతలు నిత్యవసర సరుకులు, చాపలు, దుప్పట్లు అందిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు బాలాజీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ 15 రోజులుగా అన్ని వార్డుల్లో సహాయ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. వరద బాధితులు అందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున సొంత నిధులతో సహాయం చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తరఫు నుంచి బాధితులకు ఎలాంటి సహాయం అందడంలేదని విమర్శించారు.

Updated Date - 2021-12-03T19:46:48+05:30 IST