-
-
Home » Andhra Pradesh » Chittoor » chittoor district-MRGS-AndhraPradesh
-
Chandrababuను కలవడానికి R&B అతిథిగృహం వద్దకు వచ్చిన కార్మిక మహిళలు
ABN , First Publish Date - 2022-05-12T17:44:43+05:30 IST
జీతాలు పెంచాలంటూ కుప్పం షాహి గార్మెంట్స్ మహిళా కార్మికులు చంద్రబాబును కలవడానికి వచ్చారు.
chittoor జిల్లా: జీతాలు పెంచాలంటూ కుప్పం షాహి గార్మెంట్స్ మహిళా కార్మికులు మాజీ ముఖ్యమంత్రి Chandrababuను కలవడానికి కుప్పం R&B అతిథిగృహం వద్దకు వచ్చారు. మూడేళ్లుగా తమకు జీతాలు రూ. 8,500 మాత్రమే ఇస్తున్నారని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచమని యాజమాన్యాన్ని అడిగితే పెంచేది లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. R&B అతిథి గృహం వద్ద మహిళా కార్మికులను పోలీసులు ఓదార్చే ప్రయత్నం చేశారు. తమకు జీతాలు పెంచేంతవరకు విధులకు హాజరయ్యేది లేదని మహిళా కార్మికులు తేల్చి చెప్పారు.