మదనపల్లిలో దారుణం..బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి

ABN , First Publish Date - 2021-06-17T14:15:02+05:30 IST

జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికకు పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు నీచమైన పనికి దిగజారాడు. వివరాల్లోకి వెళ్తే..మదనపల్లెలో ఉపాధ్యాయుడు దినేష్..బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మదనపల్లిలో దారుణం..బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి

చిత్తూరు: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికకు పాఠాలు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు నీచమైన పనికి దిగజారాడు. వివరాల్లోకి వెళ్తే..మదనపల్లెలో ఉపాధ్యాయుడు దినేష్..బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా కొన్ని రోజులుగా బాలికపై దినేష్ లైంగిక దాడి చేస్తున్నాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బాలికను బెదిరించాడు. ఈ విషయం బాలిక ఎవరికి చెప్పుకోలేక మానసిక క్షోభ అనుభవించింది. చివరికి బాలిక ప్రవర్తనలో మార్పులు రావడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. బాలికను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-17T14:15:02+05:30 IST