చిత్తూరులో నిలిచిన 1400 ఆర్టీసీ బస్సులు
ABN , First Publish Date - 2021-03-05T13:40:06+05:30 IST
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 1400 ఆర్టిసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
చిత్తూరు: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 1400 ఆర్టిసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దుకాణాలు, ప్రభుత్వ కళాశాలు, పాఠశాలు స్వచ్చంధంగా మూసివేశారు. టీడీపీ, వామపక్షాలు, ప్రజాసంఘాలు బంద్లో పాల్గొంటున్నాయి. బస్సులు నిలిచిపోవడంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. చిత్తూరు ప్రధాన రహదారులు నిర్మానుషంగా మారాయి.