చిత్తూరు: బట్టల లోడ్తో వెళ్తున్న వాహనంలో చోరీ
ABN , First Publish Date - 2022-03-22T17:40:49+05:30 IST
జిల్లాలోని కుప్పం - పలమనేరు జాతీయ రహదారి శెట్టిపల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద రహదారి పక్కన వాహనంలో ఉన్న బట్టలు చోరీకి గురయ్యాయి.
చిత్తూరు: జిల్లాలోని కుప్పం - పలమనేరు జాతీయ రహదారి శెట్టిపల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద రహదారి పక్కన వాహనంలో ఉన్న బట్టలు చోరీకి గురయ్యాయి. తమిళనాడు టూ హైదరాబాద్కు బట్టల లోడ్డుతో వెళ్తున్న వాహనాన్ని డ్రైవైర్ గత రాత్రి రహదారి పక్కన నిలిపాడు. అయితే డ్రైవర్ నిద్రపోతున్న సమయంలో వాహనంలో ఉన్న సుమారు 5 లక్షల రూపాయల బట్టలను దుండగులు అపహరించారు. వేకువ జామున లేచి చూసేసరికి బట్టల మూట కనిపించడం లేదని తమిళనాడు రాష్ట్రానికి చెందిన డ్రైవర్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. బట్టల మూటలు కనిపించకపోవడంతో డ్రైవర్ రమేష్ పోలీసులను ఆశ్రయించాడు.