చిత్తూరులో శిశువు కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్ట్
ABN , First Publish Date - 2022-03-21T17:05:35+05:30 IST
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు రోజుల మగ శిశువును కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
చిత్తూరు: చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు రోజుల మగ శిశువును కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నానికి చెందిన పిల్లి పద్మజ, పిండి వెంకటేష్లతో పాటు చిత్తూరుకు చెందిన పవిత్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనలో విశాఖపట్నానికి చెందిన భార్యాభర్తలు వరలక్ష్మి, నాగరాజులను అరెస్టు చేయాల్సి ఉంది. వరలక్ష్మీ, నాగరాజు దంపతులకు పిల్లలు లేని కారణంగా పిల్లి పద్మజ, పిండి వెంకటేశులు... పవిత్ర అనే మహిళతో రూ.50 వేలకు ఒప్పందం కుదుర్చుకుని చిన్నారిని కిడ్నాప్ చేశారు. కిడ్నాపైన బాలునితో సహా ఇద్దరు కిడ్నాపర్లను గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న శిశువును తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు.