చిత్తూరులో జోరుగా జల్లికట్టు

ABN , First Publish Date - 2022-02-20T15:08:27+05:30 IST

జిల్లాలోని కుప్పం మున్సిపాలిటి పరిధి అనిమిగనపల్లె గ్రామంలో జల్లికట్టు జోరుగా సాగుతోంది.

చిత్తూరులో జోరుగా జల్లికట్టు

చిత్తూరు: జిల్లాలోని కుప్పం మున్సిపాలిటి పరిధి అనిమిగనపల్లె గ్రామంలో జల్లికట్టు జోరుగా సాగుతోంది. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి జల్లికట్టు పోటీలలో పాల్గొనేందుకు భారీగా ఆవులను తరలించారు. ఒక్కో ఆవుకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. మరోవైపు జల్లికట్టును చూసేందుకు గ్రామీణ ప్రజలు, యువకులు భారీగా తరలివచ్చారు. జోరుగా జల్లికట్టు జరుగుతున్నప్పటికీ పోలీస్అధికారులు మాత్రం చోద్యం చూస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-02-20T15:08:27+05:30 IST