AP: అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు యద్ధప్రాతిపదికన ఏర్పాట్లు
ABN , First Publish Date - 2021-12-16T13:50:13+05:30 IST
జిల్లాలోని రేణిగుంట సమీపంలో బహిరంగ సభ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన అమరావతి జేఏసీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
చిత్తూరు: జిల్లాలోని రేణిగుంట సమీపంలో బహిరంగ సభ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన అమరావతి జేఏసీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ మహోద్యమం పేరిట బహిరంగ సభ నిర్వహించనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు సభ నిర్వహిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానాలు పంపారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ జరుగనుంది. అమరావతి నినాదం ఎలుగెత్తి చాటేలా సభను నిర్వహించనున్నారు.