Chittoor: అతిసారతో వరుస మరణాలు

ABN , First Publish Date - 2021-12-13T19:02:04+05:30 IST

జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం కడప గుంట ఎస్సీ కాలనీలో అతిసారతో వరుస మరణాలు సంభవిస్తున్నాయి.

Chittoor: అతిసారతో వరుస మరణాలు

చిత్తూరు: జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం కడప గుంట ఎస్సీ కాలనీలో అతిసారతో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో వాంతులు విరేచనాలతో చికిత్స కోసం చేరిన కమలమ్మ(65) మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన చిన్నబ్బా(66) అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందాడు. కాగా అతిసారతో ఇదివరకే ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో వరుస మరణాలతో  గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. అధికార యంత్రాంగం సరిగ్గా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-12-13T19:02:04+05:30 IST