Chittoor: ఆర్మీ జవాన్‌పై టోల్‌ప్లాజా సిబ్బంది దాడి

ABN , First Publish Date - 2021-11-22T16:28:03+05:30 IST

ఆర్మీ జవాన్‌పై టోల్ సిబ్బంది దాడి చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

Chittoor: ఆర్మీ జవాన్‌పై టోల్‌ప్లాజా సిబ్బంది దాడి

చిత్తూరు: ఆర్మీ జవాన్‌పై టోల్ సిబ్బంది దాడి చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. బెంగళూరు జాతీయ రహదారి బంగారుపాలెం మండలం  మహా సముద్రం వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్ద ప్రయాణికులకు టోల్‌ప్లాజా సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. తవణంపల్లి మండలం కే.గొల్లపల్లి పంచాయతీకి చెందిన ఆర్మీ జవాన్ హేమాద్రిపై టోల్ ప్లాజా సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడికి ప్రయత్నించారు. ఆర్మీ గుర్తింపుకార్డు కాకుండా క్యాంటీన్ గుర్తింపు కార్డును హేమాద్రి చూపించడంతో టోల్ ప్లాజా సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆర్మీ జవాన్‌పై  సిబ్బంది దాడికి యత్నించింది.


విషయం తెలుసుకున్న గ్రామస్తులు మూకుమ్మడిగా టోల్ ఫ్లాజా సిబ్బందిపై దాడి చేసి టోల్ ప్లాజా అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్తులు, టోల్‌ ప్లాజా సిబ్బంది మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే బంగారుపాలెం పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలోనూ అనేక సందర్భాల్లో  ప్రయాణికులపై టోల్ ప్లాజా సిబ్బంది దాడులకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో టోల్ ప్లాజా సిబ్బందికి పోలీసుల కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 

Updated Date - 2021-11-22T16:28:03+05:30 IST