Chittoor: అడిగిన మద్యం బ్రాండ్ ఇవ్వలేదని కత్తితో దాడి
ABN , First Publish Date - 2022-06-06T17:11:11+05:30 IST
అడిగిన మద్యం బ్రాండ్ ఇవ్వలేదని ప్రభుత్వ మద్యం దుకాణంలో సిబ్బందిపై మందుబాబులు కత్తితో దాడికి పాల్పడ్డారు.
చిత్తూరు: అడిగిన మద్యం బ్రాండ్ ఇవ్వలేదని ప్రభుత్వ మద్యం దుకాణంలో సిబ్బందిపై మందుబాబులు కత్తితో దాడికి పాల్పడ్డారు. కారం పొడి, పెప్పర్ స్ప్రే కళ్లలో కొట్టి అరాచకం సృష్టించారు. చిత్తూరు రూరల్ మండలం ఎన్.ఆర్ పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. మందుబాబుల దాడిలో మద్యం దుకాణం సిబ్బంది ప్రకాష్, వరప్రసాద్కు గాయాలయ్యాయి. వెంటనే వారిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.