Chittoor: ఈదురుగాలులతో పలు పంటలకు అపారనష్టం

ABN , First Publish Date - 2022-05-05T17:17:38+05:30 IST

జిల్లాలోని వి.కోట మండలంలో నిన్నటి భారీ ఈదురు గాలులకు పలు పంటలకు అపార నష్టం వాటిల్లింది.

Chittoor: ఈదురుగాలులతో పలు పంటలకు అపారనష్టం

చిత్తూరు: జిల్లాలోని వి.కోట మండలంలో నిన్నటి భారీ ఈదురు గాలులకు పలు పంటలకు అపార నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన పంటలు నేలపాలైంది. మామిడి, అరటి, వరి, రాగి పంటలకు భారీ నష్టం జరిగింది. నెర్నిపల్లి పంచాయతీలో అరటి రైతు ధనశేఖర్ రెండు ఎకరాల అరటితోట మొత్తం నేలమట్టం అయ్యింది. సుమారు 2 లక్షలు ఖర్చు చేసి చేతికి వచ్చిన పంట ఇలా నేలమట్టం అవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.  అకాల వర్షాలు రైతులకు కన్నీరు మిగిల్చాయి. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు. 

Read more