Chittoor: కుటుంబంపై వైసీపీ నాయకుల దౌర్జన్యం

ABN , First Publish Date - 2022-04-11T15:03:53+05:30 IST

జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం ఏజ్జు పల్లి పంచాయతీ పిడతల బయలు గ్రామంలో ఓ కుటుంబంపై వైసీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.

Chittoor: కుటుంబంపై వైసీపీ నాయకుల దౌర్జన్యం

చిత్తూరు: జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం ఏజ్జు పల్లి పంచాయతీ పిడతల బయలు గ్రామంలో ఓ కుటుంబంపై వైసీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ‘‘నేను ఓడిపోయిన ఇక్కడ నేనె సర్పంచ్‌ను. ఎవరికైనా నా మాటే శాసనం’’ అంటూ మాజీ సర్పంచ్ నాయణి రెడ్డి రెచ్చిపోయాడు. దాయాదుల మధ్య గొడవకు  వైసీపీ నాయకుడు ఆద్యం పోశాడు. కలెక్టర్  ఇచ్చిన ఇంటి స్థలంలో గుడిసె నిర్మించుకున్న లక్ష్మమ్మ కుటుంబంపై గత రాత్రి వైసీపీ నాయకులు దాడి చేశారు. చెంగారెడ్డి అనే నాయుడు 50 మంది అనుచరులతో కలిసి ఇంటి పైకి కట్టలు, రాడ్లతో దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా కర్రలతో కొట్టి కాలుతో  తన్నారని కుటుంబసభ్యులు తెలిపారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2022-04-11T15:03:53+05:30 IST