మదనపల్లె ప్రభుత్వాస్పత్రి ఎంఎన్వో నరసింహులు మృతి
ABN , First Publish Date - 2021-03-02T15:03:59+05:30 IST
జిల్లాలోని మదనపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ఎంఎన్వో(కాంట్రాక్టు కార్మికుడు)గా పని చేస్తున్న నరసింహులు మృతి చెందారు.
చిత్తూరు: జిల్లాలోని మదనపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ఎంఎన్వో(కాంట్రాక్టు కార్మికుడు)గా పని చేస్తున్న నరసింహులు మృతి చెందారు. 10 రోజుల క్రిందట నరసింహులు కోవిడ్ టీకా వేయించుకున్నారు. కాగా రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఎంఎన్వోను బెంగుళూరు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గత రాత్రి నరసింహులు మృతి చెందారు.