చిత్తూరులో విషాదం

ABN , First Publish Date - 2021-03-02T15:00:49+05:30 IST

జిల్లాలోని కుప్పం మండలం కృష్ణదాసనపల్లి పంచాయితీ ఒంట్టూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

చిత్తూరులో విషాదం

చిత్తూరు: జిల్లాలోని కుప్పం మండలం కృష్ణదాసనపల్లి పంచాయితీ ఒంట్టూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గత నెల 4న బట్టలు ఉతకడానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. దీంతో ఆ ఇంటి యజమాని నెలరోజులుగా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చివరకు నలుగురు మృతి చెందిన నీటి కుంట వద్ద చెట్టుకు ఉరివేసుకుని రవి ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడు. నెలరోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదు మంది ఒకే ప్రాంతంలో మృతి చెందడం గ్రామస్తులను విషాదంలో ముంచేసింది. 

Updated Date - 2021-03-02T15:00:49+05:30 IST