ఆరిమాని గంగమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తజనం
ABN , First Publish Date - 2021-01-15T16:52:30+05:30 IST
జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలంలోని ఆరిమాని గంగమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.
చిత్తూరు: జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలంలోని ఆరిమాని గంగమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఆరిమాని గంగమ్మను దర్శించుకోవడానికి స్థానిక వాసులు, కర్ణాటక ,తమిళనాడు, రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి పొంగలి పెట్టి నైవేద్యం సమర్పిస్తున్నారు. అమ్మవారికి పొట్టేళ్లను బలి ఇస్తున్నారు. వేల సంఖ్యలో పొట్టేళ్లు అమ్మవారికి బలి అవుతున్నాయి.