అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-09-22T13:54:49+05:30 IST

జిల్లాలోని కురబలకోట మండలం ముదివేడు పంచాయతీ పరదేశిపల్లికు చెందిన రైతు సతీషరెడ్డి (29) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

చిత్తూరు: జిల్లాలోని కురబలకోట మండలం ముదివేడు పంచాయతీ పరదేశిపల్లికు చెందిన రైతు సతీషరెడ్డి (29) ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో రైతు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పంటల కోసం రూ.8 లక్షలకు పైగా రైతు సతీష్‌రెడ్డి అప్పుడు చేశాడు. అప్పులు తీర్చలేకపోయిన రైతు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2020-09-22T13:54:49+05:30 IST