చిత్తూరులో ఏనుగుల గుంపు హల్చల్
ABN , First Publish Date - 2021-06-23T13:29:02+05:30 IST
జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది.
చిత్తూరు: జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. పలమనేరు పట్టణంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు రాత్రంతా కురప్పపల్లి, రామాపురం ప్రాంతంలో పంటల పొల్లాలో దాడి చేశాయి. పలమనేరు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోని రాధా బంగ్లా, మిషన్ స్కూల్ కాంపౌండ్ ప్రాంతంలోకి 25 ఏనుగుల గుంపు ప్రవేశించడంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగుల గుంపు నుంచి తమను రక్షించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.