చిత్రాడలో ‘ఉపాధి బృందం’ పర్యటన
ABN , First Publish Date - 2022-01-18T05:45:40+05:30 IST
పిఠాపురం, జనవరి 17: పిఠాపురం మండలం చిత్రాడలో ఉపాధిహామీ జాతీయస్థాయి మోనిటరింగ్ టీమ్ సభ్యులు సోమవారం పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న పలు పనులను బృందం సభ్యులు గణశ్యామ్ పాఠక్, జయకుమార్ తనిఖీ చేశారు. జాబ్కార్డులు, ఉపాధి
పిఠాపురం, జనవరి 17: పిఠాపురం మండలం చిత్రాడలో ఉపాధిహామీ జాతీయస్థాయి మోనిటరింగ్ టీమ్ సభ్యులు సోమవారం పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న పలు పనులను బృందం సభ్యులు గణశ్యామ్ పాఠక్, జయకుమార్ తనిఖీ చేశారు. జాబ్కార్డులు, ఉపాధి అనుసంధానంతో గృహనిర్మాణాలు, సామాజిక పింఛన్లు, పండ్ల తోటల పెంపకం, కోనేరు పూడికతీత, పుంతరోడ్లును పరిశీలించారు. వారి వెంట డ్వామా పీడీ వెంకటలక్ష్మి, ఏపీడీ ఏ.శాంతి, ఎంపీడీవో డీఎల్ఎస్ శర్మ, ఏపీవో కొండలరావు, సర్పంచ్ కుక్కల సునీత ఉన్నారు.