నేటి నుంచి తిరుపతిలో కఠిన ఆంక్షలు
ABN , First Publish Date - 2020-03-31T12:05:23+05:30 IST
నేటి నుంచి తిరుపతిలో కఠిన ఆంక్షలు
చిత్తూరు: నేటి నుంచి తిరుపతిలో కఠిన ఆంక్షలు విధించనున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కూరగాయల మార్కెట్లకు అనుమతి ఇచ్చారు. నిత్యావసర వస్తువులను హోం డెలివరీ చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష తెలిపారు. ఉదయం 4 నుండి 8 గంటల వరకే పాల సరఫరా ఉంటుందన్నారు. అలాగే ఉదయం 5 నుంచి 9 వరకు ఏటీఎం ఫిల్లింగ్ వెహికల్స్కు అనుమతి ఇచ్చారు.