చిట్ఫండ్స్ యాజమానికి రిమాండ్
ABN , First Publish Date - 2022-01-20T05:44:40+05:30 IST
చిట్ఫండ్స్ యాజమానికి రిమాండ్
మట్టెవాడ(వరంగల్), జనవరి 19: చిట్ఫండ్స్ ఖాతాదారులకు చిట్టీ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న యాజమానిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మట్టెవాడ సీఐ చిలువేరు రమేశ్ తెలిపారు. హనుమకొండ కేంద్రంగా నడుస్తున్న చిట్ఫండ్స్ సంస్థకు భార్యాభర్తలు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. భర్త చైర్మన్గా, భార్య ఎం.డి.గా ఉన్నారు. వీరు తమ ఖాతాదారులకు చిట్టీ డబ్బులు చెల్లించకుండా మోసం చేయడమే కాకుండా వారిని బెదిరించారు. ఈ మేరకు ఇద్దరిపై మట్టెవాడ పోలీ్సస్టేషన్లో ఫిర్యాదులు అందాయి. బుధవారం చైర్మన్ను పంథిని గ్రామం వద్ద అరెస్టు చేసి జైలుకు రిమాండ్ చేసినట్టు సీఐ తెలిపారు. ఎం.డి. పరారీలో ఉన్నట్లు తెలిపారు.