Chintamaneni prabhakar: చింతమనేని ఉదారత

ABN , First Publish Date - 2022-07-19T18:19:08+05:30 IST

వరద బాధితుల పట్ల దెందులూరు టీడీపీ(TDP) మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్(Chintamaneni prabhakar) తన ఉదారత చూపారు.

Chintamaneni prabhakar: చింతమనేని ఉదారత

ఏలూరు: వరద బాధితుల పట్ల దెందులూరు టీడీపీ(TDP) మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్(Chintamaneni prabhakar) తన ఉదారత చూపారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద బాధితులకు భారీ స్థాయిలో నిత్యావసర వస్తువుల అందజేయాలని నిర్ణయించారు.  ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై ప్రభాకర్ మండిపడ్డారు. వరద బాధితులకు సహాయం చేయడంలో వైసీపీ ప్రభుత్వం(YCP government) విఫలమైందన్నారు. బాధితులను అధికారులు పరామర్శించారే తప్పా, చిన్న పిల్లలకు పాలు కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందని అన్నారు. రేపు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కుక్కునూరు,  వేలేరుపాడు వస్తున్నారనే సమాచారంతో హడావుడిగా సహాయ చర్యలు చేపట్టారని చింతమనేని ప్రభాకర్ విమర్శించారు. 

Updated Date - 2022-07-19T18:19:08+05:30 IST