చింతలపూడి ఎత్తిపోతలను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-05-25T06:01:20+05:30 IST

చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను తక్షణం ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు.

చింతలపూడి ఎత్తిపోతలను పూర్తి చేయాలి
ఆందోళన చేస్తున్న నాయకులు, రైతులు

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన

రెడ్డిగూడెం, మే 24: చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను తక్షణం ప్రారంభించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. రెడ్డిగూడెం ప్రధాన సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, రైతాంగానికి గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా పేరుతో ప్రభుత్వం రైతులను  మోసం చేస్తుందన్నారు. చింతలపూడికి నిధులు కేటాయించి ఎప్పటి లోగా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మద్దిరెడ్డి మాధవరెడ్డి, రైతు సంఘం మండల నాయకుడు మోహన్‌రెడ్డి, అప్పిరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-25T06:01:20+05:30 IST