చింతలదీవి కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి
ABN , First Publish Date - 2022-08-19T03:26:54+05:30 IST
చింతలదీవి పశుసంవర్ధక క్షేత్రంలో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశా
కొండాపురం, ఆగస్టు18: చింతలదీవి పశుసంవర్ధక క్షేత్రంలో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. వ్యవసాయ పరిరక్షణ యాత్రలో భాగంగా గురువారం మండలంలోని మర్రిగుంట, గొట్టిగుండాల, ఆదిమూర్తిపురం, చింతలదీవి, గుడవళ్లూరు పంచాయతీల్లో వారు పర్యటించారు. ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ చింతలదీవి పశుసంవర్ధక క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించడంలేదన్నారు. క్షేత్రంలోని ఆవులు, గేదెలకు సమృద్ధిగా నీటివసతి కల్పించాలని కోరారు. ఈకార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మంగల పుల్లయ్య, రైతు సంఘం అధ్యక్షుడు పీ శ్రీరాములు, సీఐటీయూ నాయకులు పీ పెంచలయ్య, మాల్యాద్రి, జీ వెంకటేశ్వర్లు, పెద్దబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.