గాంధీ విగ్రహానికి పదింతల ఎత్తున వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారు: చింతా మోహన్

ABN , First Publish Date - 2022-02-15T21:33:52+05:30 IST

గాంధీ విగ్రహానికి పదింతల ఎత్తున వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారు: చింతా మోహన్

గాంధీ విగ్రహానికి పదింతల ఎత్తున వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారు: చింతా మోహన్

నెల్లూరు: దివంగత సీఎం దామోదరం సంజీవయ్య విగ్రహాన్ని నెల్లూరులో ఏర్పాటు చేస్తాం‌నని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం పేజీలకి పేజీలు అనవసర ప్రకటనలు ఇస్తుందన్నారరు. సంజీవయ్యకి సంబంధించి ఒక్క జానెడు ప్రకటన ఇవ్వకపోవడం గమనార్హమని చెప్పారు. దళిత సీఎం సంజీవయ్యకి ఒక్క విగ్రహం ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. గాంధీ విగ్రహానికి పదింతల ఎత్తున వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అధ్వాన్నంగా మారి, అధానీ ప్రభుత్వంగా తయారైందని విమర్శించారు. పీఎం రూ.4లక్షల నుంచి రూ.5లక్షల డ్రెస్‌లు వేస్తుంటే విదేశీ ప్రధానులే ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. రూ.12.5కోటితో కారు, రూ.1600కోట్లతో రెండు విమానాలు కొన్నారని ఆరోపించారు. 

Updated Date - 2022-02-15T21:33:52+05:30 IST