మళ్లీ ఆందోళన ప్రారంభమైంది: చినజీయర్ స్వామి
ABN , First Publish Date - 2021-02-26T04:20:45+05:30 IST
మళ్లీ ఆందోళన ప్రారంభమైంది: చినజీయర్ స్వామి
తిరుపతి: కరోనా మళ్లీ ప్రబలుతోందనే ఆందోళన ప్రారంభమైందని చినజీయర్స్వామి అన్నారు. తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆలయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి నివేదిక అందించనున్నామని చినజీయర్ స్వామి తెలిపారు.