AP News: విజయకీలాద్రిపై 26 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-09-17T00:46:27+05:30 IST

విజయకీలాద్రిపై 26 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు శరన్నవరాత్రి వేడుకలు కొనసాగనున్నాయి.

AP News: విజయకీలాద్రిపై 26 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

అమరావతి: విజయకీలాద్రిపై 26 నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు శరన్నవరాత్రి వేడుకలు కొనసాగనున్నాయి. వివిధ అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 26న మహాలక్ష్మి, 27న వీరలక్ష్మి, 28న ధనలక్ష్మి, 29న సంతానలక్ష్మి, 30న జయలక్ష్మి, అక్టోబర్ 1న ధాన్యలక్ష్మి, 2న ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, 3న రాజ్యలక్ష్మి, 4న లక్ష్మీనారాయణులు, 5న వేంకటేశ్వరస్వామిగా దర్శనమిస్తారు. దసరా పర్వదినాన వేంకటేశ్వరస్వామికి 25 కలశాలతో అభిషేకము, అలంకరణ చేస్తారు. విజయకీలాద్రిపై చినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఉత్సవాలు జరగనున్నాయి.

Updated Date - 2022-09-17T00:46:27+05:30 IST