Chinaలో కొవిడ్‌‌‌తో ముగ్గురి మృతి...షాంఘై హెల్త్ కమిషన్ ఆందోళన

ABN , First Publish Date - 2022-04-18T18:04:27+05:30 IST

చైనా దేశంలోని షాంఘై నగరంలో కొవిడ్ మహమ్మారితో ముగ్గురు మరణించారు....

Chinaలో కొవిడ్‌‌‌తో ముగ్గురి మృతి...షాంఘై హెల్త్ కమిషన్ ఆందోళన

షాంఘై(చైనా): చైనా దేశంలోని షాంఘై నగరంలో కొవిడ్ మహమ్మారితో ముగ్గురు మరణించారు.లాక్‌డౌన్ విధించిన షాంఘై నగరంలో 22,000 కరోనా కేసులు నమోదయ్యాయి.షాంఘై నగరంలో మిలియన్ల మంది ప్రజలు కరోనా వ్యాప్తి భయంతో ఇళ్లకే పరిమితం అవడంతో ఉత్పత్తికి అంతరాయం కలిగింది. లాక్‌డౌన్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి షాంఘైలో కొవిడ్ -19 మహమ్మారితో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు చైనా సోమవారం నివేదించింది.మరణించిన వారిలో ఒక వృద్ధుడు, ఇద్దరు మహిళలున్నారు. వీరు కొవిడ్ టీకాలు వేయించుకోలేదని షాంఘై నగర ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. కరోనా మృతులు డయాబెటీస్, అధిక రక్తపోటు, హృద్రోగాలతో బాధపడుతూ మరణించారని షాంఘై మున్సిపల్ హెల్త్ కమిషన్ అధికారులు చెప్పారు.లాక్ డౌన్ విధించినా కరోనా మరణాలు సంభవించడంతో షాంఘై హెల్త్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.


Updated Date - 2022-04-18T18:04:27+05:30 IST