వైసీపీ నేతల కనుసన్నల్లోనే నాటుసారా దందా: చినరాజప్ప

ABN , First Publish Date - 2022-03-16T18:32:13+05:30 IST

జంగారెడ్డి గూడెం ఘటనపై అసెంబ్లీలో సీఎం జగన్ అవాస్తవాలు చెప్పారని టీడీపీ ఎమ్మెల్యేలు...

వైసీపీ నేతల కనుసన్నల్లోనే నాటుసారా దందా: చినరాజప్ప

అమరావతి: జంగారెడ్డి గూడెం ఘటనపై అసెంబ్లీలో సీఎం జగన్ అవాస్తవాలు చెప్పారని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారా దందా కొనసాగుతోందని మాజీ మంత్రి చినరాజప్ప విమర్శించారు. అసత్యాలు చెప్పిన సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు.


ఈ సందర్భంగా చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పోలీస్ స్టేషన్లు, వైసీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారని అన్నారు. ఆ వైసీపీ ప్రజాప్రతినిధులే నాటు సారా తయారు చేయిస్తున్నారని ఆరోపించారు. సభలో అసత్యాలు చెప్పే ముఖ్యమంత్రికి కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేయాలన్నారు. నాటు సారా తాగి చనిపోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.

Updated Date - 2022-03-16T18:32:13+05:30 IST