అబద్ధాలు చెప్పి అధికారంలోకి జగన్‌: చినరాజప్ప

ABN , First Publish Date - 2020-05-29T08:53:32+05:30 IST

‘గత ఐదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.

అబద్ధాలు చెప్పి అధికారంలోకి జగన్‌: చినరాజప్ప

అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): ‘గత ఐదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోలేకపోయాం. జగన్‌ అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు’ అని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. గురువారం మహానాడులో పార్టీ సంస్థాగత అంశాలపై ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. జ్యోతుల నెహ్రూ, గౌతు శిరీష బలపరిచారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయుల్లో పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు చెప్పినా చాలామంది ఎమ్మెల్యేలు శ్రద్ధ పెట్టలేదని చినరాజప్ప చర్చ సందర్భంగా ఆక్షేపించారు. ‘టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లినా, నేతలు వెళ్లిపోయినా.., పార్టీకి బలమైన కేడర్‌ ఉంది. మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, స్థానిక నాయకులు పార్టీ పటిష్ఠతకు మరింత కృషి చేయాలి. కొందరు నిశ్శబ్ధంగా, నిర్లిప్తతగా ఉండడం సరికాదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు కనీసం ఎంపీటీసీని నిలబెట్టి గెలిపించలేరా? చంద్రబాబు కూడా ఎవరెవరు పని చేస్తున్నారో గమనించాలి’ అని సూచించారు.ఙ

Updated Date - 2020-05-29T08:53:32+05:30 IST