వుహాన్‌లో ప్రయాణ ఆంక్షలు సడలింపు

ABN , First Publish Date - 2020-03-29T09:35:04+05:30 IST

కరోనా మహమ్మారికి కేంద్రమైన చైనాలోని వుహాన్‌లో ప్రయాణ ఆంక్షలను పాక్షికంగా సడలించారు.

వుహాన్‌లో ప్రయాణ ఆంక్షలు సడలింపు

వుహాన్‌, మార్చి 28: కరోనా మహమ్మారికి కేంద్రమైన చైనాలోని వుహాన్‌లో ప్రయాణ ఆంక్షలను పాక్షికంగా సడలించారు. దాదాపు కోటిమందికి పైగా జనాభా ఉన్న ఈ నగరంలో జనవరి నుంచి లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ప్రయాణాలపై పూర్తి నిషేధం విధించడంతో పాటు నగర శివార్లను మూసివేశారు. సుదీర్ఘ లాక్‌డౌన్‌కు తెరదించుతూ మొదటి ప్యాసింజర్‌ రైలు అర్ధరాత్రి దాటిన తర్వాత వుహాన్‌ చేరుకుందని అక్కడి మీడియా పేర్కొంది. ప్రస్తుతానికి బయటినుంచి వుహాన్‌లోకి వచ్చేవారినే అనుమతించారు. 

Updated Date - 2020-03-29T09:35:04+05:30 IST