చైనాలో హత్యకు గురైన భారతీయ విద్యార్థి.. అనుమానితుడి అరెస్ట్
ABN , First Publish Date - 2021-08-04T21:44:40+05:30 IST
భారత్కు చెందిన విద్యార్థి చైనాలో తన హాస్టల్ గదిలో శవమై కనిపించిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా.. సదరు విద్యార్థిని హత్య చేసినట్టు భావిస్తున్న పోలీసులు అనుమానితు
బీజింగ్: భారత్కు చెందిన విద్యార్థి చైనాలో తన హాస్టల్ గదిలో శవమై కనిపించిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా.. సదరు విద్యార్థిని హత్య చేసినట్టు భావిస్తున్న పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బిహార్లోని గయకు చెందిన అమన్ నాగ్సేన్(20) అనే యువకుడు ఉన్నత చదువుల కోసం చైనా వెళ్లాడు. ఇక్కడ ఫారెన్ స్టడీస్ యూనివర్సీటిలో ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ కోర్సు చదువుతున్నాడు. ఈ క్రమంలో జూలై 23న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడాడు కూడా. ఆ తర్వాత నుంచి భారత్లోని కటుంబ సభ్యులు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా స్పందించడం లేదు. ఈ క్రమంలో అతని కోసం వెతగ్గా.. జూలై 29న హాస్టల్ గదిలో శవమై కనిపించాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నరబలిలో భాగంగా నాగ్సేన్ హత్యకు గురైనట్టు భావిస్తున్న పోలీసులు విచారణలో భాగంగా ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారని చైనా విదేశాంగశాఖ వెల్లడించింది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుడు.. ఫారెన్ స్టడీస్ యూనివర్సిటీకి చెందినవాడేనని పేర్కొంది. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఇండియన్ ఎంబసీకి ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్టు చెప్పింది. ఇదిలా ఉంటే.. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుడు ఏ దేశానికి చెందిన వాడనే వివరాలను చైనా విదేశాంగశాఖ బయటపెట్టలేదు.