సరిహద్దు పరిస్థితులపై చైనా ఏమన్నదంటే..

ABN , First Publish Date - 2020-07-09T21:48:08+05:30 IST

గల్వాన్ లోయ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో....

సరిహద్దు పరిస్థితులపై చైనా ఏమన్నదంటే..

బీజింగ్: గల్వాన్ లోయ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్‌తో మరోసారి చర్చలు నిర్వహిస్తామని, సరిహద్దు విషయంలో ఇకముందు ఎలాంటి నిబంధనలను పాటించాలని అనే విషయాలపై ఇందులో చర్చిస్తామని వివరించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావ్ లిజియన్ మాట్లాడుతూ, కమాండర్ స్థాయిలో చర్చలు జరిగిన అనంతరం గల్వాన్ లోయలో ఇరు దేశాల సైన్యాలు కూడా వేగంగా వెనక్కి మళుతున్నాయని, ఇది మంచి పరిణామమని అన్నారు. ‘సరిహద్దు వద్ద పరిస్థితులు అదుపులో ఉన్నాయి. మెరుగుపడుతున్నాయి. అయినప్పటికీ ఈ విషయంలో భారత్‌తో మరిన్ని చర్చలు నిర్వహిస్తాం. సైనిక పరమైన చర్యలే కాకుండా ప్రభుత్వ స్థాయిలో కూడా చర్చలు నిర్వహించనున్నాం. సైన్యాన్ని వెనక్కి తీసుకోవడంలోనే కాకుండా చర్చల ద్వారా సాధించిన పరిష్కారాన్ని అమలుచేయడంలోనూ భారత్ మాకు పూర్తిగా సహకరిస్తుందని ఆశిస్తున్నాం’ అని ఝావ్ పేర్కొన్నారు. అయితే చైనా తమ సైన్యాన్ని ఎప్పటిలోగా వెనక్కి తీసుకుంటుంది, ఎంతవరకు వెనక్కి తీసుకుంటుంది అనే విషయాలపై మాత్రం ఆయన ఎటువంటి సమాచారాన్ని వెల్లడించడకపోవడం గమనార్హం.

Updated Date - 2020-07-09T21:48:08+05:30 IST