భూమికి తిరిగొచ్చిన చైనా రాకెట్
ABN , First Publish Date - 2022-04-03T08:20:36+05:30 IST
గత ఏడాది ఫిబ్రవరిలో చైనా ప్రయోగించిన చాంగ్ షెంగ్ 5బీ
- మహారాష్ట్ర గగనతలంలో దగ్ధం
- పలు చోట్ల కనిపించిన వెలుగులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: గత ఏడాది ఫిబ్రవరిలో చైనా ప్రయోగించిన చాంగ్ షెంగ్ 5బీ రాకెట్ శనివారం రాత్రి తిరిగి భూమిలోకి ప్రవేశించి దగ్ధమైంది. మహారాష్ట్ర గగనతలంపై ఈ ఘటన చోటుచేసుకోవడంతో పలు చోట్ల ఆకాశంలో వెలుగులు కనిపించాయి. ఈ రాకెట్ వెనక్కి రానున్నట్లు అమెరికాకు చెందిన ఖగోళ పరిశోధకుడు జొనాథన్ మెక్డవెల్ ముందుగానే ట్విటర్లో వెల్లడించారు.