tokyo olympics: టాప్లోనే చైనా
ABN , First Publish Date - 2021-07-31T04:12:10+05:30 IST
ట్యోక్యో ఒలింపిక్స్లో చైనా టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. శుక్రవారం పోటీలు ముగిసేసరికి..
ట్యోక్యో ఒలింపిక్స్లో చైనా టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. శుక్రవారం పోటీలు ముగిసేసరికి 19 గోల్డ్, 10 సిల్వర్, 11 బ్రాంజ్ మెడల్స్తో మొత్తం 40 మెడల్స్ సాధించి టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. ఇక జపాన్ 17 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్తో మొత్తం 28 మెడల్స్తో రెండో ప్లేస్లో కొనసాగుతోంది. మూడో ప్లేస్లో అమెరికా 14 బంగారు, 16 రజత, 7 కాంస్య పతకాలతో మూడో స్థానంలో ఉంది. ఇక భారత విషయానికొస్తే కేవలం ఒకే ఒక్క రజత పతకంతో 51వ స్థానంలో కొనసాగుతోంది.
భారత్తో పాటు బర్గేరియా, జోర్డాన్, నార్త్ మెసిడోనియా, పోలాండ్, టర్క్మెనిస్తాన్, వెనిజులాలు కూడా ఒక్కో రజత పతకంతో భారత్తో పాటు 51వ స్థానంలో కొనసాగుతున్నాయి. కాగా.. భారత్ ఈ రోజు మరో రెండు పతకాలను పక్కా చేసుకుంది. షట్లర్ సింధుతో పాటు మహిళా బాక్సర్ లవ్లినా బోర్గోహైన్ కూడా ఓ పతకాన్ని కైవసం చేసుకోవడం ఖాయం చేసుకుంది.