చైనాలో ఆగని కరోనా మరణాలు...మరో నలుగురి మృతి
ABN , First Publish Date - 2020-04-03T14:08:46+05:30 IST
కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు.....
బీజింగ్ (చైనా): కరోనా వైరస్ ఉద్భవించిన చైనా దేశంలో మరణాలు ఆగిపోవడం లేదు. మెయిన్ల్యాండ్ చైనాలో కొత్తగా 31 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. ఇందులో ఇద్దరు రోగులకు స్థానికంగా కరోనా ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యుల పరీక్షల్లో తేలింది. మెయిన్ల్యాండ్ చైనాలో కొత్తగా నలుగురు కరోనా వైరస్తో మరణించారు. మొత్తంమీద చైనా దేశంలో 81,322 మందికి కరోనా వైరస్ సోకగా, వీరిలో 3,322 మంది మరణించారు. మూడు నెలలు దాటినా చైనాలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గక పోవడంతో చైనా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.