కరోనాను ఎదుర్కొనేందుకు నానో మెటీరియల్స్‌ను సిద్దం చేసిన చైనా

ABN , First Publish Date - 2020-03-30T09:40:43+05:30 IST

ప్రపంచదేశాలతో పోల్చితే కరోనా వైరస్‌ను చైనా గట్టిగా ఎదుర్కొంటోందని చెప్పాలి. ఎక్కడైతే కరోనా పుట్టుకొచ్చిందే ప్రస్తుతం అక్కడి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేసింది.

కరోనాను ఎదుర్కొనేందుకు నానో మెటీరియల్స్‌ను సిద్దం చేసిన చైనా

బీజింగ్: ప్రపంచదేశాలతో పోల్చితే కరోనా వైరస్‌ను చైనా గట్టిగా ఎదుర్కొంటోందని చెప్పాలి. ఎక్కడైతే కరోనా పుట్టుకొచ్చిందే ప్రస్తుతం అక్కడి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేసింది. హుబే ప్రావిన్స్‌లో రవాణాను కూడా ప్రభుత్వం పునరుద్దరించింది. వూహాన్‌లో తప్పించి మిగతా అన్ని చోట్ల విమాన రాకపోకలు కూడా సాగుతున్నాయి. కరోనా కేసులు నమోదు కావడం మొదలైన వెంటనే చైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్లే కరోనా అదుపులోకి రాగలిగింది. ఇదిలా ఉండగా.. కరోనాతో పోరాడటానికి చైనా శాస్త్రవేత్తలు సూక్ష్మ పదార్థాల(నానో మెటీరియల్స్)ను అభివృద్ధి చేసినట్టు. చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది. కరోనాతో పోరాడటానికి డ్రగ్ కాకుండా నానో మెటీరియల్‌ను తయారుచేయడం కొత్తగా ఉందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. 96.5 నుంచి 99.9 శాతం వైరస్‌ను తొలగించే సామర్థ్యం ఈ నానో మెటీరియల్‌కు ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా.. నానో మెటీరియల్స్‌ను వివిధ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. పెయింట్, ఫిల్టర్స్, ఇన్సులేషన్ తదితర ఉత్పత్తుల్లో నానో మెటీరియల్స్‌ను ఎక్కువగా వాడతారు. మరోపక్క నానో టెక్నాలజీని ఉపయోగించి ఫార్మాస్యూటికల్స్‌ను డిజైన్ చేస్తారు.

Updated Date - 2020-03-30T09:40:43+05:30 IST