సరిహద్దు ఉద్రిక్తతలు సద్దుమణిగాయి..చైనా ప్రకటన

ABN , First Publish Date - 2021-07-16T03:09:43+05:30 IST

భారత్ చైనా సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు సద్దుమణిగాయని చైనా తాజాగా ప్రకటించింది. వాస్తవాధీన రేఖ వివాదాన్ని ఇరు దేశాలు పక్కన పెట్టి ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించాలని కూడా అభిప్రాయపడింది.

సరిహద్దు ఉద్రిక్తతలు సద్దుమణిగాయి..చైనా ప్రకటన

న్యూఢిల్లీ: భారత్ చైనా సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు సద్దుమణిగాయని చైనా తాజాగా ప్రకటించింది. వాస్తవాధీన రేఖ వివాదాన్ని ఇరు దేశాలు పక్కన పెట్టి ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించాలని కూడా అభిప్రాయపడింది. షాంఘాయ్ కొఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాల సందర్భంగా బుధవారం నాడు ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రులు సమావేశమైన విషయం తెలిసిందే. దీనిపై చైనా విదేశాంగ శాఖ కార్యాలయం గురువారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది రష్యా రాజధాని మాస్కోలో తాను అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో సమావేశమైన తరువాత సరిహద్దు వద్ద ఉద్రికత్తలు తగ్గాయని, గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు నుంచి ఇరు దేశాల సైన్యాలు వెనక్కుతగ్గాయని ఈ ప్రకటనలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ పేర్కొన్నారు.  అంతేకాకుండా.. స్థూలంగా చూస్తే ఉద్రిక్తతలు తగ్గాయని ఆయన వ్యాఖ్యానించారు.   

Updated Date - 2021-07-16T03:09:43+05:30 IST