ఇద్దరు చిన్నారుల అదృశ్యం

ABN , First Publish Date - 2022-08-08T05:53:31+05:30 IST

ఇద్దరు చిన్నారుల అదృశ్యం

ఇద్దరు చిన్నారుల అదృశ్యం
అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు(ఫైల్‌)

నాగ్‌పూర్‌కు చెందిన వ్యక్తిపై అనుమానాలు

అన్నారంషరీఫ్‌లో ఘటన 

పర్వతగిరి, ఆగస్టు 7: తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నా రులు కనిపించకుండా పోయిన ఘటన పర్వతగిరి మండ లం అన్నారంషరీఫ్‌ గ్రామంలో జరిగింది. పక్కింటో ఉండే వ్యక్తే వీరిని కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నా రు. స్థానిక ఎస్సై దేవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం... సి కింద్రాబాద్‌లోని మౌలాలికి చెందిన మహ్మద్‌ యూసుఫ్‌.. తన భార్య అనారోగ్యంతో మృతిచెందడంతో మూడు నెలల క్రితం కుమారుడు రెహాన్‌(6), కుమార్తె కిజ్రాబేగం(2)తో కలిసి అన్నారంషరీఫ్‌ గ్రా మానికి బతుకుదెరువు కోసం వచ్చాడు. అన్నారంలో యూసుఫ్‌ అద్దెకు ఉంటూ ది నసరి కూలీగా పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం యూసుఫ్‌ వ్యక్తిగత పని నిమిత్తం బయటికి వెళ్లి ఇంటికి వచ్చి చూడగా ఇద్దరు పిల్లలు కనిపించలేదు. దీంతో యూసుఫ్‌తోపాటు స్థా నికులు గ్రామంలో పిల్లల కోసం గాలించగా ఆచూకీ లభించకపోవడంతో యూసుఫ్‌ ఆదివారం ఉదయం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే యూసుఫ్‌ ఇంటి పక్కనే అద్దెకుండే నాగ్‌పూర్‌కు చెందిన వ్యక్తి.. ఇద్దరు పిల్లలను ఎ త్తుకెళ్లి ఉంటాడని పోలీసులు అను మానిస్తున్నారు. ఎస్సై దేవేందర్‌ ఆ ధ్వర్యంలో పోలీసులు గ్రామంతో పాటు చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు చిన్నారులు, నాగ్‌పూర్‌కు చెందిన వ్యక్తి ఆచూకీ తెలిస్తే పర్వతగిరి ఎస్సై 94407 95207, పర్వతగిరి సీఐ 73826 08575, పర్వతగిరి పోలీస్‌ స్టేషన్‌ 94407 00531 నెంబర్లలో తెలపాలని ఎస్సై కోరారు.

Updated Date - 2022-08-08T05:53:31+05:30 IST